సికింద్రాబాద్, 6 జూలై (హి.స.)
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలుతిరుపతి-హిసార్ మధ్య 12 సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లు ప్రతి బుధ, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి. అదే విధంగా, కాచిగూడ-తిరుపతి మధ్య 8 రైళ్లు ప్రతి గురు, శుక్రవారాల్లో రాకపోకలు సాగిస్తాయి. ఇక నరసాపూర్-తిరువణ్ణామలై మార్గంలో అత్యధికంగా 16 ప్రత్యేక రైళ్లను బుధ, గురువారాల్లో నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్