అమరావతి, 9 జూలై (హి.స.)
సింహాచలం: విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచే వివిధ ప్రాంతాల భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. తొలి పావంచా వద్ద అప్పన్న స్వామికి కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు బయలుదేరి వెళుతున్నారు. అధికారికంగా మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం ఆధ్వర్యంలో తొలి పావంచా నుంచి స్వామి వారి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. అంతకుముందుగానే భక్తులు ప్రదక్షిణను ప్రారంభించారు. (Andhra
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ