పాఠశాలలకు టీచర్ల.కేటాయింపు పై .మే నెలలో.జారీ చేసిన జీవో 21 కి. కొన్ని.సవరణలు
అమరావతి, 1 ఆగస్టు (హి.స.) , :పాఠశాలలకు టీచర్ల కేటాయింపుపై మే నెలలో జారీచేసిన జీవో 21కు కొన్ని సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని ఫౌండేషనల్‌ స్కూల్‌కు విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని మార్చింది. పాత
పాఠశాలలకు టీచర్ల.కేటాయింపు పై .మే నెలలో.జారీ చేసిన జీవో 21 కి. కొన్ని.సవరణలు


అమరావతి, 1 ఆగస్టు (హి.స.)

, :పాఠశాలలకు టీచర్ల కేటాయింపుపై మే నెలలో జారీచేసిన జీవో 21కు కొన్ని సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని ఫౌండేషనల్‌ స్కూల్‌కు విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని మార్చింది. పాత జీవో ప్రకారం 1 నుంచి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయించగా, ఇప్పుడు 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌గా సవరణ చేసింది. 60 మంది విద్యార్థులకు రెండో టీచర్‌ను ఇస్తారని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 1901 మంది టీచర్లు అవసరమవుతారని తెలిపింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande