దిల్లీ, 1 ఆగస్టు (హి.స.)
ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను పోలింగ్ రోజే.. అనగా సెప్టెంబర్ 9నే ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. జూలై 22న జగదీప్ ధన్ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.
ఆగస్టు 7న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆగస్టు 21 చివరి తేదీ కానుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు