న్యూ డిల్లీ, 11 ఆగస్టు (హి.స.)
ఇజ్రాయెల్ తాజాగా కొత్త రకం యుద్ధం మొదలుపెట్టింది. ఈసారి చేపట్టే ఆపరేషన్ తక్కువ సమయంలోనే ముగుస్తుందని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివారం సరికొత్త ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇన్ని నెలల నుంచి గాజాపై యుద్ధం చేస్తున్నా.. ఎప్పుడూ జర్నలిస్టులను టార్గెట్ చేసుకోలేదు. కానీ ఆదివారం మాత్రం జర్నలిస్టుల లక్ష్యంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు జర్నలిస్టులు మృతిచెందారు. ఆదివారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో జర్నలిస్టు ముసుగులో ఉన్న హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ తెలిపింది. అల్-షరీఫ్ను తామే చంపామని.. అతడు జర్నలిస్టుగా నటిస్తున్న హమాస్ ఉగ్రవాది అని పేర్కొంది. అల్-షరీఫ్ హమాస్కు చెందిన ఒక భాగానికి నాయకత్వం వహిస్తు్న్నాడని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు