ఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.)
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం నిధులు నేరుగా రైతుల అకౌంట్లలోకి ఈ రోజు విడుదల చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఈ రోజు సోమవారం రాజస్థాన్ లోని జుంజునులో జరిగే కార్యక్రమంలో దేశంలోని 30 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.3,200 కోట్ల నిధులను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విడుదల చేయనున్నారు.
ఈ నిధుల్లో అత్యధికంగా రూ.1,156 కోట్ల నిధులు మధ్యప్రదేశ్ రైతుల అకౌంట్లలో జమ కానుండగా.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రైతుల ఖాతాల్లో రూ.1,121 కోట్లు జమ కానున్నాయి. మిగిలిన రాష్ట్రాల రైతుల ఖాతాల్లో మిగతా రూ.903 కోట్ల నిధులు జమ కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి