తిరుమల, 11 ఆగస్టు (హి.స)
వానలు కురుస్తుండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
ఈ క్రమంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 3 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇక, ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకునేందుకు వచ్చారు. నిన్న 82,628 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకోగా… వీరిలో 30,505 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం విలువ రూ.3.73 కోట్లుగా టిటిడి తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి