పెద్దపల్లి, 12 ఆగస్టు (హి.స.)
పెద్దపల్లి జిల్లాలో పంచాయతీరాజ్
శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పని తీరుపై కలెక్టర్ సమీక్షించారు. సీసీ రోడ్లు, ప్రభుత్వ దవాఖానలు, సబ్ సెంటర్ల నిర్మాణం, మర్మమతు పనుల పురోగతిపై ఆరా తీశారు.
హెల్సెంటర్స్మారమ్మతు పనులు, సబ్ సెంటర్ భవనాలు, పాఠశాలల మరమ్మతులు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హస్టల్స్ మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేశామని, ఆ నిధులను వినియోగించుకుంచుకోవాలని సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..