తిరుమల: , 13 ఆగస్టు (హి.స.)
బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని అలంకరించేందుకు రూ.25 లక్షల విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు. ఈమేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ