అమరావతి, 13 ఆగస్టు (హి.స.)
అమరావతి రాజధానిలో మరో మైలురాయి. తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ శంకుస్థాపన బుధవారం జరిగింది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం.. నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నారా బ్రాహ్మిణి సహా.. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. 25 ఏళ్ల సేవా వారసత్వం కలిగిన బసవతారకం సంస్థ, ఇప్పుడు రాజధాని అమరావతి విస్తరణతో అడుగులు వేసింది. అధునాతన క్యాన్సర్ కేర్ సెంటర్తో పాటు రెండు దశల్లో రీసెర్చ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి