తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 13 ఆగస్టు (హి.స.)
కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా
తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సుజాతనగర్ మండలంలోని కోయగూడెం గ్రామానికి చెందిన జరుపుల బిక్కులాల్, లక్ష్మణ్ 2018 నాటి ఓ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఆ కేసులో కొత్తగూడెం సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు నిందితులను ఎస్సై ఎం రమాదేవి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు