హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.)
కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్
చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బహిర్గతమైన వేళ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లోలో పార్టీ ముఖ్య నేతలు జగదీశ్ రెడ్డి, హరీశ్రావు, కేటీఆర్తో ఆయన సమావేశమయ్యారు. కేబినెట్కు కాళేశ్వరం నివేదిక అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్టు ఇవ్వనున్న నేపథ్యంలో ఆ అంశంపై ఇవాళి భేటీలో ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే సర్కార్ కావాలనే కమిషన్ నివేదికను మీడియాకు లీక్ చేసిందని మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్