అమరావతి, 5 ఆగస్టు (హి.స.)
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల రుణ కష్టాలు ఎట్టకేలకు తీరాయి. ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలిచ్చేందుకు ఎట్టకేలకు బ్యాంకులు ముందుకు వచ్చాయి. దీంతో రైతులను ఏళ్ల తరబడి వెంటాడుతున్న దా'రుణ'కష్టాల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికినట్లయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ