తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల, 5 ఆగస్టు (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలను ఈ రోజు(మంగళవారం) నుంచి ఈ నెల(ఆగస్టు)7వ తేదీ వరకు నిర్వ
తిరుమల


తిరుమల, 5 ఆగస్టు (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలను ఈ రోజు(మంగళవారం) నుంచి ఈ నెల(ఆగస్టు)7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

గత రాత్రి ఈ ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ తరుణంలో ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(మంగళవారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(సోమవారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 69,928 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.21 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande