దిల్లీ: 5 ఆగస్టు (హి.స.)
దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). భారత్పై సుంకాలు మరింతగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో నిన్నటి లాభాలు ఆవిరయ్యాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ.. మన సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 195.33 పాయింట్ల నష్టంతో 80,823 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ (nifty) 53 పాయింట్లు క్షీణించి 24,669 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.85 వద్ద ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ