ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు
న్యూఢిల్లీ, 12 సెప్టెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా పాఠశాలల లక్ష్యంగా ప్రతిరోజూ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్, డ
ఢిల్లీ హైకోర్టు


న్యూఢిల్లీ, 12 సెప్టెంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా పాఠశాలల లక్ష్యంగా ప్రతిరోజూ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.

హైకోర్టుకు బెదిరింపులు రాగానే న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రాంగణాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఢిల్లీ హైకోర్టుకు ఈ మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి తనిఖీలు చేపట్టారు.

ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 2 గంటలలోపు ఖాళీ చేయాలని ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు తెలిపారు. అయితే సందేశంలో పేలుడు పదార్థాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. ప్రస్తుతం బాంబ్, డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande