ఓ ఆర్ ఆర్ పై కారును ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి, ఐదుగురికి గాయాలు
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) ఆదిబట్ల ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఓఆర్ఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చ
రోడ్డు ప్రమాదం


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

ఆదిబట్ల ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు

ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఓఆర్ఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తలించారు.అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రావిర్యాల ఎగ్జిట్-13 నుంచి బొంగ్లూర్ ఎగ్జిట్-12కు వెళ్తుండగా ఓఅర్ఆర్పై ఆపిన కారును వెనుక నుంచి లారీ ఢీ కొట్టిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande