అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)
కృష్ణా జిల్లా:వైసీపీ చేపట్టిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో పోలీసుల వైఖరి పట్ల మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ చర్యలు స్వాగతిస్తున్నామన్నారు. రూల్ మైండ్తో విధులు నిర్వహిస్తున్న ఎస్పీ అందరి విషయంలో ఒకేలా చట్టాన్ని అమలు అయ్యేలా చూడాలని అన్నారు. రాష్ట్ర చరిత్ర లో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసు నమోదు చేయడం.. ఆ కేసులో 10 సంవత్సరాల శిక్షకు సంబంధించిన సెక్షన్ కూడా వేసి బెయిల్ రాకుండా మీరు చేసే ప్రయత్నం ఎక్కడా చూడలేదని విమర్శించారు. లోపలికి పంపితే గర్వంగా వెళ్తామని తామేమీ హత్యలు చేసి వెళ్లడంలేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ