అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు సోదాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్, చెన్నైలో చేపట్టిన సోదాలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయాల్లో సమారు 7 గంటల పాటు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్, కొండాపూర్లోని వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు చేసి.. హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. అనిల్ రెడ్డికి సంబంధించి చెన్నైలో 9 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాలు కూడా ముగిసినట్లు అధికారులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ