శ్రీవారి సేవకులకు టిటిడి చైర్మన్ బీవర్ నాయుడు గుడ్ న్యూస్
తిరుమల:23 సెప్టెంబర్ (హి.స.) శ్రీవారి సేవకులకు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు శుభవార్త చెప్పారు. సేవా కాలం ముగిసిన అనంతరం వారి విశేష సేవలకు గాను మరింత మెరుగైన స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు స
శ్రీవారి సేవకులకు టిటిడి చైర్మన్ బీవర్ నాయుడు గుడ్ న్యూస్


తిరుమల:23 సెప్టెంబర్ (హి.స.) శ్రీవారి సేవకులకు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు శుభవార్త చెప్పారు. సేవా కాలం ముగిసిన అనంతరం వారి విశేష సేవలకు గాను మరింత మెరుగైన స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన శ్రీవారి సేవకులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్భాంధవులని తితిదే ఛైర్మన్‌ అన్నారు. శ్రీవారి సేవకులంటే తనకెంతో గౌరవమన్నారు. సీఎం చంద్రబాబుని కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తుంటానని వెల్లడించారు. దేశంలోని ఎంతోమంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడన్న ఆయన.. వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనన్నారు. సీఎం ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. శ్రీవారి సేవా విభాగం పదింతలు అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande