ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి.. కరీంనగర్ కలెక్టర్
కరీంనగర్, 23 సెప్టెంబర్ (హి.స.) ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోగులకు ఉచి
కరీంనగర్ కలెక్టర్


కరీంనగర్, 23 సెప్టెంబర్ (హి.స.)

ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను, పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు. ఇక్కడ యోగా కేంద్రంలో యోగాసనాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి అందజేస్తున్న సేవలను వివరంగా రోగులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణీలకు సాధారణ ప్రసవానికి మేలు చేసే యోగాసనాలను గురించి తెలియజేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande