హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)
సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకుంటున్నదని లేఖ రాసిన మావోయిస్టు సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. అతడిని ద్రోహిగా ప్రకటించడంతోపాటు, ఆయన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేనట్లయితే వాటిని పీపుల్స్ గొరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల లేక విడుదల చేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..