నగరానికి ఉప రాష్ట్రపతి.. ఉన్నతాధికారులతో ఎంపీ సమీక్ష
విజయవాడ, 23 సెప్టెంబర్ (హి.స.) దసరా నవరాత్రుల వేళ.. బెజవాడ వేదికగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. బుధవారం ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా
నగరానికి ఉప రాష్ట్రపతి.. ఉన్నతాధికారులతో ఎంపీ సమీక్ష


విజయవాడ, 23 సెప్టెంబర్ (హి.స.) దసరా నవరాత్రుల వేళ.. బెజవాడ వేదికగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. బుధవారం ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. విజయవాడలో ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ రోజు మంగళవారం విజయవాడలో ఉన్నతాధికారులతో ఎంపీ కేశినేని చిన్ని సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎంపీ కేశినేని చిన్ని విలేకర్లతో మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ పర్యటనకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సైతం అధిక సంఖ్యలో పాల్గొనున్నారని చెప్పారు. ఇక మంగళవారం ఈ ఉత్సవ్‌కు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారని పేర్కొన్నారు.

అయితే ఈ విజయవాడ ఉత్సవ్‌కు రోజుకు ఒక ప్రముఖులు హాజరవుతారని వివరించారు. అందులో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ మరునాడు అంటే సెప్టెంబర్ 29వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు హాజరువుతారని తెలిపారు. డ్రోన్ షో ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని తెలిపే విధంగా ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని వివరించారు. కూటమి నేతలు అందరూ కలిసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande