ఆంధ్రప్రదేశ్.డిప్యూటీ స్పీకర్ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు
అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.) విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల ప్రతీకగా నిలుస్తోంది. తాజాగా ఈ పవిత్ర ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని
ఆంధ్రప్రదేశ్.డిప్యూటీ స్పీకర్ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు


అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల ప్రతీకగా నిలుస్తోంది. తాజాగా ఈ పవిత్ర ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రఘురామ కృష్ణంరాజుకు లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande