అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు (బుధవారం)నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు లాంఛానంగా ప్రారంభం అవుతాయి. సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస్థంభంపై అర్చకులు ధ్వజపఠాని ఎగుర వేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాత్రి 7.50 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీవారికీ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ