బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు మజ్లిస్‌ సమాయత్తం
దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.) బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేయడానికి ఎంఐఎం ఏర్పాట్లు చేసుకుంటోంది. గత శాసనసభ(2020)ఎన్నికల్లో 25 స్థానాలకు పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించిన మజ్లిస్‌ ఈసారి అదనంగా మరో పది స్థానాల్లో అభ్యర్థు
Owaisi


దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.) బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేయడానికి ఎంఐఎం ఏర్పాట్లు చేసుకుంటోంది. గత శాసనసభ(2020)ఎన్నికల్లో 25 స్థానాలకు పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించిన మజ్లిస్‌ ఈసారి అదనంగా మరో పది స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించాలని చూస్తోంది. బిహార్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సీమాంచల్‌లో నివసిస్తున్న ముస్లిం మైనారిటీల ఓట్లతో విజయం సాధించవచ్చనే ధీమాతో మజ్లిస్‌ ఆ ప్రాంతంలోని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పోటీలో దించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఈ నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు బిహార్‌లోని కిషన్‌గంజ్‌ నుంచి ‘సీమాంచల్‌ న్యాయ యాత్ర’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు మజ్లిస్‌ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande