తూర్పుగోదావరి, 4 సెప్టెంబర్ (హి.స.)
: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది ( తాళ్లపూడి మండలం మలకపల్లి వద్ద విశాఖ పోలీసులు రూ.1.5 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి పోలీసులు ఈ కారును వెంబడిస్తూ వచ్చారు. చివరకు మలకపల్లి వద్ద గంజాయి స్మగ్లర్ పోలీసులకు చిక్కాడు. మరో నిందితుడు పరారయ్యాడు. 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని తాళ్లపూడి పోలీసు స్టేషన్కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ