అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)GST సంస్కరణలు అవసరమని సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలకు సూచించారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. GST సంస్కరణలకు సంపూర్ణ మద్దతు తెలిపామని.. GST స్లాబ్ల క్రమబద్ధీకరణతో సామాన్యులకు ఊరట కలుగుతుందని పయ్యావుల పేర్కొన్నారు. కొత్త స్లాబ్ల వల్ల ఏపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు నష్టపోతుందన్నారు. అయినప్పటికీ ప్రజల మేలు కోసం మద్దతు తెలిపామని తెలిపారు. GST సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పయ్యావుల కేశవ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి