తెలంగాణ, మంచిర్యాల. 4 సెప్టెంబర్ (హి.స.)
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తు విద్యారంగా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం తాండూర్ మండలం తంగళ్ళపల్లి గ్రామ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ వసతి గృహ ఏర్పాటుకు తహసీల్దార్ జ్యోత్స్న తో కలిసి కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.అనంతరం తాండూర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనానికి పెద్ద చెరువు ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ జ్యోత్స్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు