కొండాపురం(కడప), 5 సెప్టెంబర్ (హి.స.): మండలంలోని టీకోడూరు గ్రామం సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మెగా సోలార్ పవర్ప్లాంట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 300 మెగావాట్ల సామర్థ్యంతో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మెగా సోలార్పవర్ ప్లాంట్ పనులు చకచకా జరుగుతున్నాయి. దీనిని రూ.1700 కోట్ల వ్యయంతో కేంద్రప్రభుత్వం నిర్మిస్తోంది. 2024 సంవత్సరంలో ప్రారంభమైన పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ సోలార్ ప్రాజెక్టుకు రైతుల నుంచి 1500 ఎకరాల భూమిని సేకరించారు.
లీజు ప్రాతిపదికన సంవత్సరానికి రూ.30,000 చెల్లిస్తారు. ప్రస్తుతం రైతుల అంగీకరం మేరకు వారి భూముల్లోనే సోలార్ ప్యానెళ్లు అమర్చే ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాంతంలోనే విద్యుత్సబ్స్టేషన్ను కూడా ఏర్పాటుచేశారు. సోలార్ ప్యానెళ్ల నుంచి సౌరశక్తిని తీసుకుని దానిని విద్యతుసబ్స్టేషన్కు మళ్లిస్తారు. తద్వారా గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. ఆ ప్రాజెక్టు ద్వారా దాదాపు 300 మందికి ఉద్యాగాలు లభించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి