అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో సముద్ర పక్కనున్న రాష్ట్రాల్లో వాతావరణ సానుకూల పరిస్థితులు మారుతున్నాయి. సముద్రమట్టం నుండి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం, ఈ ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో గాలులు వేగం గంటకు 40-60 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని, అలాగే వానలు మోస్తరు స్థాయిలో పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రానికి వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాలపైన గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. వర్షాలు, గాలుల కారణంగా రహదారుల పరిస్థితులు అసాధారణంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తగా తీసుకోవాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి