
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. వికెట్ కీపర్ రిషబ్ గాయంతో ఈ సిరీస్కు దూరమయ్యాడు. శనివారం ప్రాక్టీస్ సెషన్లో కడుపులో నొప్పి రావడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. అతడికి ఎంఆరొ స్కాన్ చేయించామని, పంత్ ఆరోగ్య పరిస్థితినిబ బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 11 నుంచి వడోదరాలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పంత్ ఆడే అవకాశం లేదని బీసీసీఐ అధికారికంగా స్పష్టం చేసింది. అతడి స్థానంలో ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో రాణించిన ధ్రువ్ జురేల్ను టీంలోకి తీసుకున్నారు. వన్డే జట్టులో జురేల్ రిజర్వ్ వికెట్ కీపర్గా ఉంటాడు. కాగా, న్యూజిలాండ్తో తొలి వన్డే వడోదర వేదికగా నేడు (జనవరి11) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు