తమిళనాడు నుంచి బయల్దేరి ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ గుడ్‌న్యూస్ అందించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు భారీ గిఫ్ట్ ప్రకటించింది. కొత్తగా మరో మూడు రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్
Vande Bharat train


హైదరాబాద్, 11 జనవరి (హి.స.)ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ గుడ్‌న్యూస్ అందించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు భారీ గిఫ్ట్ ప్రకటించింది. కొత్తగా మరో మూడు రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఉపయోగపడేలా పలు నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో భాగంగా తమిళనాడు నుంచి కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మూడు రైళ్లు తమిళనాడు నుంచి బయల్దేరి ఏపీ మీదుగా పశ్చిమబెంగాల్ వరకు వెళతాయి.

ఈ మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీని వల్ల తమిళనాడు, ఏపీ, పశ్చిమబెంగాల్ ప్రజలకు లాభం జరగనుంది. ఇప్పటికే సామాన్యుల కోసం దేశవ్యాప్తంగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande