పార్టీ మార్పు వార్తలపై స్పందించిన RS ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, 16 జనవరి (హి.స.) పార్టీ మార్పు వార్తలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ''తెలంగాణ ప్రజలను పట్టపగలే మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


హైదరాబాద్, 16 జనవరి (హి.స.)

పార్టీ మార్పు వార్తలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'తెలంగాణ ప్రజలను పట్టపగలే మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఆ ప్రజాగ్రహం నుండి తప్పించుకోవడానికి యధావిధిగా మరో అటెన్షన్ డైవర్షన్ కుట్రకు తెరలేపారు. నా మీద సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారుతున్నాను అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తున్నారు. ఈ వార్తలను ప్రచారం చేయడం ఆపకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.

అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande