కాకినాడలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు మహిళల మృతి
కాకినాడ, 15 ఫిబ్రవరి (హి.స.)కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది.. సర్పవరం జాతీయ రహదారి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట పద్మవతి మరియు దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు విశాఖపట్
కాకినాడలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు మహిళల మృతి


కాకినాడ, 15 ఫిబ్రవరి (హి.స.)కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది.. సర్పవరం జాతీయ రహదారి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట పద్మవతి మరియు దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు విశాఖపట్నం నుండి కాకినాడకు వెళ్తుండగా.. డ్రైవర్ గూగుల్ మ్యాప్‌లో సూచించిన షార్ట్‌కట్ రూట్‌ను అనుసరించగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు..

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు వెనక నుండి వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు.. కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ ప్రదీప్ చెప్పారు, గూగుల్ మ్యాప్ షార్ట్‌కట్ చూపించడం వల్ల సాధారణ రూట్ కాకుండా వెళ్ళడంతో ప్రమాదం జరిగిందని అని చెబుతున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande