
అమరావతి, 15 ఫిబ్రవరి (హి.స.),రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో పదేళ్లకు పైగా వాడుతున్న డొక్కు జీపులకు మోక్షం లభిస్తోంది. బడ్జెట్లో నిధులు కేటాయించడంతో సుమారు 3వేల వాహనాల కొనుగోలు చేయనున్నారు. పోలీసుల వాహనాలు పాతబడి పోయాయని, మరో నాలుగేళ్లలో 3వేలకు పైగా వాహనాలను పక్కకు పెట్టాల్సి వస్తుందంటూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ