భారత్‌ పాక్‌పై ఘన విజయం
ఏసీసీ మహిళల ఆసియా కప్
భారత్‌ పాక్‌పై ఘన విజయం


హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టీ20 టోర్నీలో భారత్‌ పాక్‌పై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్‌ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ‌ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను భారత బౌలర్లు 93 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూల్చారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా (10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి) ఛేదించారు. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌-ఏలో రెండో స్థానానికి చేరింది. దీనికి ముందు మ్యాచ్‌లో భారత అమ్మాయిలకు యూఏఈ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande