జార్ఖండ్లో మున్సిపల్ ఎన్నికల సందడి.. 48 స్థానిక సంస్థలకు కొనసాగుతున్న పోలింగ్
ఝార్ఖండ్, 23 ఫిబ్రవరి (హి.స.) జార్ఖండ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) సందడి కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాష్ట్రంలోని 48 పట్టణ స్థానిక సంస్థలకు (ULB) సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునేంద
Jharkhand


ఝార్ఖండ్, 23 ఫిబ్రవరి (హి.స.)

జార్ఖండ్ రాష్ట్రంలో మున్సిపల్

ఎన్నికల (Municipal elections) సందడి కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాష్ట్రంలోని 48 పట్టణ స్థానిక సంస్థలకు (ULB) సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునేందుకు రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేయగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 43.43 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులుగా ఉన్నారు. రాష్ట్రంలోని 48 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఓటర్లు తేల్చనున్నారు. నగరాలు, పట్టణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ స్థానిక ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగనుండగా, ఓటింగ్ శాతం పెంచేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande