
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.)ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నగర పరిధి 80 అడుగుల రహదారిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు వినతులు స్వీకరించారు
. అర్జీదారుల సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. సుమారు 1,500 మంది నుంచి అర్జీలు అందాయని కేంద్ర మంత్రి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వృద్ధురాలి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిని చిత్రంలో చూడొచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ