
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)
హైదరాబాద్లోని నాంపల్లీలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తీరుకు వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు నాంపల్లిలోని బోర్డు కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు. సుమారు 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయకుండా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు బోర్డు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.
రంగంలోకి దిగిన పోలీసులు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు సహా పలువురు నేతలను, విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సెక్రటరీ కృష్ణ ఆదిత్య కార్పొరేట్ కాలేజీలతో కుమ్మక్కై విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అక్రమ అరెస్టులకు మేము భయపడబోమని. 300 మంది విద్యార్థులకు వెంటనే హాల్ టికెట్లు జారీ చేసే వరకు మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..