భారీ నష్టాలను చవిచూస్తోన్న భారత స్టాక్ మార్కెట్లు
ముంబయి,19 ,ఫిబ్రవరి (హి.స.) భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సూచీలు భారీగా పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 83,969.82 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకా
Bombay Stock Exchange


ముంబయి,19 ,ఫిబ్రవరి (హి.స.) భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సూచీలు భారీగా పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 83,969.82 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక దశలో 82,943.49 కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (NIFTY 50) కూడా 230 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఉదయం 10:12 గంటల సమయంలో 25,771 వద్ద ఉన్న నిఫ్టీ.. మధ్యాహ్నానికి మరింత బలహీనపడింది. స్టాక్ మార్కెట్లు నష్టపోతున్న తరుణంలో బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. మార్కెట్ కీలక సపోర్ట్ స్థాయిల కంటే కిందకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande