
అమరావతి, 28 ఫిబ్రవరి (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తసీఉకుంది.. ఇక, రూ. 5,456 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్లో శ్రీవారి ఆదాయం, వ్యయ కేటాయింపులు మరియు పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రత్యేకంగా నిలిచాయి.
* శ్రీవారి ఆదాయం కోట్లలో..
– హుండీ ద్వారా – 1,880 కోట్లు
– వడ్డీ ద్వారా – 1,205 కోట్లు
– ప్రసాదాల విక్రయం ద్వారా – 650 కోట్లు
– దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా – 310 కోట్లు
– ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా – 135 కోట్లు
– తలనీలాల విక్రయం ద్వారా – 175 కోట్లు
ఈ విధంగా మొత్తం ఆదాయం సుమారు రూ. 5,456 కోట్లుగా అంచనా వేసింది టీటీడీ..
* టీటీడీ వ్యయ కేటాయింపులు (రూ. కోట్లు)
– ఉద్యోగుల జీతభత్యాలకు – 1,859 కోట్లు
– ముడి సరుకుల కొనుగోలుకు – 974 కోట్లు
– ఫిక్స్డ్ డిపాజిట్లకు – 700 కోట్లు
– ఇంజనీరింగ్ పనులకు – 475 కోట్లు
* టీటీడీ పాలకమండలి ముఖ్య నిర్ణయాలు
– విద్యాసంస్థల అభివృద్ధి పనులకు రూ. 118.8 కోట్లు కేటాయింపు.
– భక్తుల కోరిక మేరకు “శ్రీవారి ముడుపు” పథకం ప్రారంభం.
– రూ. 120 కోట్ల వ్యయంతో అత్యాధునిక అన్నప్రసాద సముదాయం నిర్మాణం.
– ఆలయాల నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలకు సడలింపు.
– ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ నిర్మాణానికి రూ. 20.8 కోట్లు కేటాయింపు.
– కోయంబత్తూర్, గౌహతి, బెలగావి, పాట్నా నగరాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టడం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ