
: ఆదిలాబాద్, 21 మార్చి (హి.స.)
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. MDK ట్రావెల్స్కు చెందిన బస్సు ఓవర్టేక్ చేయబోయే క్రమంలో ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ముఖ్యంగా క్యాబిన్ భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ఓవర్టేకింగ్ కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ