ఢిల్లీ మెట్రోకు మహర్దశ: ₹18,300 కోట్లతో కొత్త కారిడార్లు
న్యూఢిల్లీ, 08 మార్చి (హి.స.) భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సుమారు 18,300 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టుల (Metro project)కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెట్రోలో రెండు కొత్త కా
Delhi metro


న్యూఢిల్లీ, 08 మార్చి (హి.స.)

భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సుమారు 18,300 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టుల (Metro project)కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెట్రోలో రెండు కొత్త కారిడార్లను ఆయన జాతికి అంకితం చేశారు. ఇందులో సుమారు 12.3 కిలోమీటర్ల పొడవున్న మజ్లిస్ పార్క్ మౌజ్పూర్ బాబర్పూర్ (పింక్ లైన్) కారిడార్తో పాటు, 9.9 కిలోమీటర్ల పొడవైన దీపాలీ చౌక్ - మజ్లిస్ పార్క్ (మెజెంటా లైన్) కారిడార్లు అందుబాటులోకి వచ్చాయి. రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేశారు.

ఈ నూతన మెట్రో మార్గాల వల్ల ఢిల్లీలోని బురారీ, జగత్పూర్-వజీరాబాద్, ఖజూరి ఖాస్, భజన్పురా, యమునా విహార్, మధుబన్ చౌక్ వంటి అనేక కీలక ప్రాంతాల ప్రజలకు గొప్ప ఊరట లభించనుంది.. అంతేకాకుండా హైదర్పూర్ బాధీ మోర్, భల్వాస్వా-మజ్లిస్ పార్క్ వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడటంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. రాజధాని నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం తో పాటు పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలను పెంపొందించడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande