
గుంతకల్లు(అనంతపురం):, 30 ఏప్రిల్ (హి.స.)
ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్ స్పెషల్ బైవీక్లీ ఎక్స్ప్రెస్ (07033/34)ను ఇకపై రెగ్యులర్ బైవీక్లీ ఎక్స్ప్రెస్గా ప్రమోట్ చేశారు. కాకినాడటౌన్-మైసూరు (నం. 17289) బైవీక్లీ రెగ్యులర్ ఎక్స్ప్రెస్ను మే 1వ తేదీ నుంచి సోమ, శుక్రవారాల్లో వారానికి రెండురోజులు నడపనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఈ రైలు కాకినాడ టౌన్లో ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (17290) రైలు మే 2వ తేదీ నుంచి మంగళ, శనివారాలలో మైసూరులో సాయంత్రం 5.05 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11-30 గంటలకు కాకినాడ టౌన్కు చేరుకుంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ