
అనకాపల్లి, 30 ఏప్రిల్ (హి.స.)
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో భారీ గంజాయి స్మగ్లింగ్ను పోలీసులు భగ్నం చేశారు. ఒడిశా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన పక్కా సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలోని బృందం కేడీపేట సమీపంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముఠా పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అరెస్ట్ అయిన నిందితులను కాకినాడకు చెందిన తేజ్ కిరణ్, చందు, సింహాద్రి, అరవింద్, విగ్నేష్గా గుర్తించారు. వీరి నుంచి ఒక కారు, మూడు బైకులు, ఐదు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, వారిని కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi