
అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)ఇటీవలే ఏపీరాజధాని అమరావతికి చట్టభద్రత లభించిన విషయం తెలిసిందే..దాంతో ఏపీలో సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది తమ హర్షాన్ని వ్యక్త ంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి మహిళారైతులు తమ కలలు కన్న కల నెరవేరిందని మొక్కులు చెల్లించుకున్నారు.విజయవాడ ప్రసిద్ధదేవాలయం బెజవాడ దుర్గమ్మ సన్నిధికి కాలినడక బయలుదేరి వెళ్లారు. . ప్రకాశం బ్యారేజీ సీతానగరం నుంచి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ పాదయాత్ర చేపట్టారు. అమ్మవారికి సారె, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ