
విశాఖపట్నం: , 15 మే (హి.స.)
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో భారతీయ రైల్వే లోగోలో రైల్వే బోర్డు కొన్ని మార్పులు చేసింది. రైల్వే శాఖకు చెందిన లోగోలో రైల్వే జోన్లకు సూచికగా ఎరుపు రంగులో నక్షత్రాలు ఉంటాయి. జూన్ 1 నుంచి 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా జోన్ అధికారికంగా అమల్లోకి రానుంది. దీంతో 18 నక్షత్రాలతో కూడిన కొత్త లోగోను రైల్వేబోర్డు గురువారం విడుదల చేసింది. ఇకనుంచి భారతీయ రైల్వే అంతటా ఈ లోగోను వినియోగించాలని ఆదేశాలు వచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ