
హైదరాబాద్, 15 మే (హి.స.)
హైదరాబాద్లో ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే 'మృగశిర కార్తె చేప ప్రసాదం' పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జూన్ 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్ కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ ప్రియాంక, బత్తిన కుటుంబ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ మేనేజ్మెంట్, క్యూ లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi