
ఎమ్మిగనూరు, 02 మే (హి.స.)ఎమ్మిగనూరు (కర్నూలు) పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఏజెన్సీస్, గంజహళ్లి రోడ్డులో అనధికారికంగా విత్తనాలకు సంబంధించిన ఎలాంటి సోర్స్ లేకుండా విత్తనాలు అమ్ముతుండగా మొత్తం 957 ప్యాకెట్లు సీజ్ చేసి, 6A కేసు నమోదు చేసినట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు మహమ్మద్ ఖాద్రి, మండల వ్యవసాయ అధికారి శివశంకర్ పేర్కొన్నారు.
ఈ రోజు పట్టణంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని గంజిహళ్లి రోడ్డు లో అనుమతులు లేని విత్తనాలను గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ రూ,8,62,257 ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారి శివశంకర్ మాట్లాడుతూ …. సర్ప్రైజ్ విజిట్ లో భాగంగా తనిఖీ చేయగా విత్తన దుకాణంలో అనధికారికంగా విత్తనాలు ఉంచుకొని ఎలాంటి సోర్స్ లేకుండా రైతులకు విక్రయిస్తుండగా మొత్తం 957 ప్యాకెట్లు సీజ్ చేసి , 6ఏ కేసు నమోదు చేయడమైనదని చెప్పారు. ఈ విత్తనాలను బిజినెస్ చేసుకునే డీలర్లకు ముఖ్యంగా ఫారం – Cసర్టిఫికేట్, రైతులకు విక్రయించే అన్ని రకాల విత్తనాలు లైసెన్సులో ఇంక్లూడ్ అయి ఉండాలని చెప్పారు. గోడౌన్ లైసెన్సులో ఇంక్లూడ్ చేసుకొని మాత్రమే విత్తనాలను రైతులకు విక్రయించాలని, ఇలాంటివి ఏవీ లేకుండా విత్తనాలను విక్రయిస్తే 420 (చీటింగ్) కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV